సామాజిక మాధ్యాల్లో మెసేజ్ ఫార్వార్డ్ చేసిన టీచర్ ని సస్పెండ్ చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు త‌న చీప్ లిక్క‌ర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జగన్ గారిని ఏం చెయ్యాలి? నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా? అంటూ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు లోకేష్.  సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్చని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి అని లోకేష్ డిమాండ్ చేసారు. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది అని ఆయన ఆరోపణలు చేసారు. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: