టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకం సాధించింది. వెయిట్లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. 49 కేజీల విభాగంలో ఈ పథకాన్ని గెలుచుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాకుండా ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా భారత్ మరికొన్ని విభాగాల్లోనూ దూసుకుపోతుంది.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కు చెందిన సౌరవ్ చౌదరి ఫైనల్ కు అర్హత సాధించారు. అంతేకాకుండా భారత హాకీ జట్టు కూడా ఒలంపిక్స్ లో పైనల్ కు చేరుకుంది. మరోవైపు ఆర్చరీలో భారత్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఆర్చరీ మిక్స్డ్ టీమ్ కు చెందిన దీపికా కుమారి, ప్రవీణ్ యాదవ్ చైనా ను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో వీరు విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: