వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి త‌న‌ను బెదిరించార‌ని, ఎవ‌రికైనా త‌న పేరు చెబితో న‌రుకుతాన‌న్నాడ‌ని రంగ‌య్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. రంగ‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, ఆయ‌న‌తో త‌న‌కు ప‌రిచ‌య‌మే లేద‌ని, తాను ఎవ‌రినీ బెదిరించ‌లేద‌ని గంగిరెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌డ‌ప‌లోకానీ, పులివెందుల‌లోకానీ తాను బెదిరించిన‌ట్లు ఎక్క‌డా ఒక్క కేసు కూడా న‌మోదుకాలేద‌ని, తాను వివేకాకు ద్రోహం చేసే వ్య‌క్తిని కాన‌ని, ఆయ‌న హ‌త్య‌కేసులో త‌న‌కు ప్ర‌మేయం లేద‌న్నారు. త‌న‌పై ఈగ కూడా వాల‌నీయ‌బోమ‌ని సీబీఐ అధికారులు భ‌రోసా ఇచ్చార‌ని, ఆ భ‌రోసాతోనే తాను జ‌మ్మ‌ల‌మ‌డుగు న్యాయ‌స్థానంలో వాంగ్మూలం ఇచ్చాన‌ని రంగ‌య్య చెప్పారు. పులివెందుల చేరుకున్న రంగ‌య్య‌ను స్థానికులు, విలేక‌రులు ప్ర‌శ్నిస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎవ‌రితో ఏమీ చెప్ప‌వ‌ద్ద‌ని, ఏద‌డిగినా త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని చెప్పాల‌ని సీబీఐ అధికారులు సూచించిన‌ట్లు రంగ‌య్య అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag