వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడిపై సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర మండిప‌డ్డారు. గ‌తంలో డెయిరీ న‌డిపిన అనుభ‌వం ఉండి కూడా సంగంపై అర్థ‌ర‌హిత‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌న్నారు. త‌న‌కున్న ప‌నికిరాని భూముల‌ను ప్ర‌భుత్వానికి రూ.18కోట్ల‌కు విక్ర‌యించ‌డం వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. ఆ భూముల‌తో స‌మీపంలోనే పొలాల‌ను కొనుగోలు చేశార‌ని, వినుకొండ బైపాస్ రోడ్డును వాటికి స‌మీపం నుంచి మ‌ళ్లించింది కూడా వాస్త‌వం కాదా? అని నిల‌దీశారు. పాడి రైతుల‌కు ఇచ్చే బోన‌స్ గురించి, ఇత‌ర ప్రోత్సాహ‌కాల గురించి అవ‌గాహ‌న లేకుండా బ్ర‌హ్మ‌నాయుడు మాట్లాడ‌టం స‌రికాద‌ని, ప‌ద‌వితోకూడా వ్యాపారం చేయ‌వ‌చ్చ‌ని నిరూపించిన వ్య‌క్తి ఆయ‌నేన‌ని ఘాటుగా స్పందించారు. తిరుమ‌ల డెయిరీ పేరుతో గ‌తంలో డెయిరీని నిర్వ‌హించిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, పాడి రైతుల‌కు డ‌బ్బులు చెల్లించ‌డంలేద‌ని, ఇత‌ర ప్రోత్సాహ‌కాలు కూడా లేవంటూ నిన్న విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై ఈరోజు సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag