మాజీ మంత్రి, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు పెదవి విప్పని ఆయన వాచ్‌మన్ రంగన్న జ‌మ్మ‌ల‌బ‌డుగు న్యాయ‌స్థానంలో వాంగ్మూలం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కోర్టులో రంగ‌న్న ఏం చెప్పారంటూ స్థానికులు ప్ర‌శ్నిస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఎర్ర గంగిరెడ్డి రంగ‌న్న ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న‌పై క‌డ‌ప‌లోకానీ, పులివెందుల‌లోకానీ ఎక్క‌డా కేసులు న‌మోదుకాలేద‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌నపై రంగ‌న్న స్పందించారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌ర‌గ‌డానికి ముందు అర్థ‌రాత్రి కొంద‌రు వ్య‌క్తులు ఇంట్లోకి వ‌చ్చార‌ని, వాళ్లెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎర్ర గంగిరెడ్డి వివేకానంద‌రెడ్డితోనే ఉంటారు.. ఆయ‌న నాతో ఎన్నోసార్లు మాట్లాడారు.. ఇప్పుడు అస‌లు నేనెవ‌రో తెలియ‌ద‌ని చెబుతుంటే ఏమ‌నుకోవాల‌ని రంగ‌న్న ప్ర‌శ్నించారు. త‌న‌కు పూర్తిస్థాయి హామీ ఇస్తేనే సీబీఐకి అన్ని విష‌యాలు వెల్ల‌డించాన‌ని, జ‌మ్మ‌ల‌మ‌డుగు కోర్టులో జ‌డ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చాన‌న్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag