హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సంబంధించి మీడియాతో వివరాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము అని ఆయన వెల్లడించారు. 2500 మంది తో భద్రత ఏర్పాటు చేసాం అని అన్నారు. ఇప్పటి ఆలయ కమిటీల తో సమావేశం ఏర్పాటు చేసాం అని మీడియాకు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పని సరి మాస్కులు ధరించాలి అని ఆయన స్పష్టం చేసారు.

కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి అని హైదరాబాద్ సీపీ సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు. కరోనా సమయంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషం అని ఆయన పేర్కొన్నారు. జాబ్ మేళా కు ముందు కు వచ్చిన వివిధ కంపెనీలకు ధన్యవాదాలు చెప్పారు. గడిచిన రెండు సంవత్సరాలలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33 శాతం మహిళలకు ఉద్యోగాలు ఇప్పించామన్నారు అంజనీ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: