టిడిపి నేత దేవినేని ఉమ కు వీరులపాడు మండలం, జూలూరు లో ఘోర పరాభవం జరిగింది. కొంతమంది టిడిపి కార్యకర్తలు, కొంత మంది గ్రామస్తులు కలిసి దేవినేని ఉమను నిలదీశారు. తమకు ఏం న్యాయం చేశారంటూ లోకల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరబల్లి మండలం లోని టిడిపి కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవకు దిగారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కొంత మంది టిడిపి నేతలను అరెస్ట్ చేశారు. ఇక నిత్యం ప్రభుత్వ పథకాలను ఏకి పారేయడంలో ముందుండే దేవినేని ఉమ ను కొంతమంది నేతలు కావాలనే టార్గెట్ చేసి ఇలా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసేలా చేశారంటూ టిడిపి వర్గం వ్యాఖ్యానిస్తోంది. నిరసన వ్యక్తం చేసిన అనుసాగరం గ్రామస్తుల తీరు మరోలా ఉంది. టిడిపి నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: