టోక్యో లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒలింపిక్స్ లో భారత్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మొదటి నుంచి ఫెవరెట్ గా ఉన్న బాక్సర్ వికాస్ ఎన్నో అంచనాల మధ్య పోరాటం లోకి దిగి మొదటి రౌండ్ లోనే ఓటమిపాలయ్యాడు.  పురుషుల 69 కేజీల విభాగంలో పోటీ పడిన వికాస్  జపాన్ లోని ప్రముఖ బాక్సర్ అయిన ఒకాజవా తో తలపడి ఓటమిపాలయ్యాడు.  మొదటి నుంచి ఒకాజవా వికాస్ పై ఆధిపత్యం చూపించి 5-౦ పాయింట్లతో  విజయం సాధించిన విజయం సాధించాడు. ఒకాజవా  పంచులు దాటికి పూర్తి డిఫెన్స్ లోకి వెళ్లిన వికాస్ అతడి ముందు నిలబడ లేక పోయాడు . ఒకాజవా వికాస్ మొఖంపై పిడిగుద్దులు గుద్దడంతో తీవ్ర రక్థస్రావం జరిగింది. ఇక వికాస్ కి ఇప్పటికె అర్జున అవార్డు లభించగా కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. 2012, 2016 ఒలింపిక్స్ లో సైతం పాల్గొన్న వికాస్ నిరాశ మిగిల్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: