వాట్సాప్ పిల్లి జూమ్ పిల్లి అంటూ కొన్ని మాటలు సాయిరెడ్డి అనేశారు..అనడమే కాదు పసుపు పార్టీ పై ఇంకొన్ని ఆరోపణలూ చేశారు.. ఈ సారి తన వాయిస్ ను ఛేంజ్ చేసి తమ పార్టీ మాత్రమే దూకుడుగా ఉందని రాష్ట్రం కోసం ఏమయినా చేసేందుకు
తాము మాత్రమే సిద్ధమన్న సంకేతాలు ఇచ్చి టీడీపీని అనరాని మాటలన్నారు.. విశాఖ ఉక్కుపై టీడీపీ పోరు సాగిస్తుంటే ఆఖరులో జాయిన్ అయిన వైసీపీ జోరు పెంచడం ఆ తరువాత క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుండడం గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే.... వీటిపై సాయిరెడ్డి స్పందన ఇవన్నీ ఫేక్ ఉద్యమాలే అని తేల్చేసింది.. ఇవన్నీ పులి వేషం లాంటిది అని తులనాడారు..
వైఎస్సార్సీపీ నేత విజయ్ సాయిరెడ్డి సోషల్ మీడియాలో టీడీపీ పై ఫైర్ అయ్యారు.. అలా ఇలా కాదు.. చాలా కోపంగా ఉన్నారు.. వాళ్లపై...రాష్ట్ర ప్రయోజనాల సాధనే తమ ధ్యేయం అని తమతో కలిసి వచ్చే వారితో పనిచేస్తామని ఓ వైపు చంద్రబాబు చెబుతుంటే సాయిరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.. తాము నిధుల కోసం.. హక్కుల కోసం పార్లమెంట్ ను స్తంభింపజేస్తుం టే కొందరు మాత్రం తమకు పిల్లుల్లా కనబడుతున్నారని ఆయన వాపోయారు. వాట్సాప్ పిల్లి సోషల్ మీడియా పిల్లి అని అంటూ టీడీపీ నాయకులను కాస్త కించ పరుస్తూనే వ్యాఖ్యలు చేశారు.