గోవధ నిషేధం పై తాను మాట్లాడిన మాటలు వైసిపి పార్టీకి, సీఎంవో కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని బీజేపీ వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారని చెన్నకేశవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పక్కా హిందువునని హిందూ దేవుళ్ళని కొలుస్తానని స్పష్టం చేశారు. మైనారిటీల గురించి బిజెపి నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారు అంటూ చెన్నకేశవ రెడ్డి మండిపడ్డారు. మైనార్టీలను వ్యతిరేకిస్తూ బిజెపి పార్టీ గోవులను అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తోందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా శనివారం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవధ చట్టం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గోవధ చట్టం అమలు అనేది అస్సలు సాధ్యం కాని విషయమని అన్నారు. భారత్ లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ కూడా ఒకటి అని వ్యాఖ్యానించారు. బక్రీద్ పండుగ రోజున ఆర్ఎస్ఎస్, బిజెపి, బజరంగ్దళ్ గోవధ చట్టాన్ని వివాదంగా ఉపయోగించుకుంటున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. లౌకిక దేశంలో గోవు పూజించేవారికి వస్తువు... తినేవారికి ఆహారం అని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp