ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగి పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో జైపూర్ కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప కూడా మరణించారు. అయితే చనిపోయే కొంత సమయం క్రితం దీప చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల ప్రాంతంలో ఇండియా టిబెట్ బార్డర్ వద్ద దిగిన ఫోటోను దీప షేర్ చేశారు.

ఈ సందర్భంగా ప్రకృతి పై దీప తన ప్రేమను చాటుకున్నారు.  అనంతరం 1:25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరి వద్ద రోడ్డుపై వెళ్తున్న కార్ల మీద పడ్డాయి. అందులో డాక్టర్ దీప కూడా ఉన్నారు. కారుపై కొండ చరియలు విరిగిపడటంతో నుజ్జు నుజ్జయ్యాయి. దాంతో ప్రయాణిస్తున్న దీప మరణించారు. ఇక ప్రస్తుతం ప్రకృతి ప్రేమికురాలు మరణించింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఎంతో ఆనందంగా గడపాలని వెళ్లిన విహారయాత్ర విషాదంతో ముగిసిందని సంతాపం ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: