యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న చౌటుప్పల్ చెరువును సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెరువును సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గానికే రెండు వేల కోట్లు కేటాయిస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

ఇక తన మునుగోడు నియోజకవర్గానికి రెండు వేల కోట్లు ఇస్తే నేను రాజీనామాకు సిద్ధం అంటూ ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే సంస్కారం లేదన్న ఈ విషయం మారాలని అన్నారు. ఇక మరి నిజంగా రెండు వేల కోట్లు ఒక్కో నియోజకవర్గానికి ఖర్చు పెడితే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: