ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు చెందిన ఇద్దరు మహిళా యాంకర్ ల పై సైబర్ క్రైం లో కేసు నమోదు అయ్యింది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పనిచేస్తున్న‌ ఇద్దరు యాంకర్లు తమ ఆఫీస్ లో పనిచేస్తున్న పూర్ణిమ, సుమతి, సుందర్ అనే వ్యక్తుల ఫోటోలను మరియు పర్సనల్ వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. తాము ఎన్ని సార్లు అడిగినా కూడా ఫోన్ ఇవ్వ‌కుండా యాంకర్లు బెదిరిస్తున్నారని ఓ బాధితురాలు పోలీసులకు తెలిపింది. 

అంతేకాకుండా తమ యాంకర్లు శారీరకంగా అదేవిధంగా మానసికంగా కూడా త‌మ‌ను వేధింపులకు గురి చేస్తున్నట్టు యువతి ఆరోపించింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న టీవీ ఇండ‌స్ట్రీలో సంచలనంగా మారింది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు IPC 66,  R/w 43, 84(B)ఐటి ఆక్ట్, R/w 511 కింద కేసు నమోదు నమోదు చేశారు. అయితే ఇద్దరు యాంకర్లు ఎవరనేది ఇంకా పోలీసులు బయటకు వెల్లడించలేదు. దాంతో ఆ ఇద్దరు ప్రముఖ యాంకర్లు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: