పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుంభకోణాలు ప్రజాస్వామ్యాని కి తీవ్రమైన ప్రమాదకారి అంటూ భారతీయ జనతా పార్టీ పై మండిపడ్డారు. అంతే కాదు ఈ కుంభకోణంపై విచారణకు సైతం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు మమత. సుప్రీమ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తో కమిటీని ఏర్పాటు చేసి కుంభకోణం పై పూర్తి వివరాలు కావాలని ఆదేశించారు. ఇక పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై మొట్టమొదటిసారిగా విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రిగా మమత చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్రం దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేయాలి కానీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విచారణ కమిటీని తానే పెట్టాను వేశానని మమతా స్పష్టంచేశారు. రానున్న నాలుగు వారాల్లో ఈ సంఘటన పై కమిటీ నివేదిక సమర్పించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: