మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ మైలవరం ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. సాగర్ కాలువల ఆధునీకరణ పేరుతో కోట్లల్లో అవినీతి చేశారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మేజర్ కాలువ ఆధునీకరణ పేరుతో 20 కోట్ల రూపాయల మేర భారీ అవినీతి జరిగిందన్నారు వసంత కృష్ణప్రసాద్. ఆయన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే... వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే. ఎన్ఎస్పీ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మేజర్ కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువల సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలను మాజీ మంత్రి దోచేశారన్నారు ఎమ్మెల్యే వసంత. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: