తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ఉన్న నీటి పంపిణీ వ్యవహారంలో గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. దీనికి సంబంధించి కృష్ణ నీటి యాజమాన్యం బోర్డు తెలంగాణ కు ఒక లేఖ రాసింది. కృష్ణా నదిపై ఉన్న పాత మరియు కొత్త నిర్మాణాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల వివరాలను అందించాలని ఆదేశించింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల వివరాలు  ఇవ్వాలంటూ పేర్కొంది. అంతే కాదు సాగునీటి ప్రాజెక్టులు డీపీఆర్‌లు సైతం అందివ్వాలంటూ ఆదేశించింది. తెలంగాణ లో జరుగుతున్న 37 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ నీటి జలాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ఉండటం అందరికి తెలిసిందే. కృష్ణ వాటాల విషయంలో రెండు రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: