బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బ్రిటిష్ నటి అమీ జాక్సన్ సంచలన విషయంతో వార్తల్లో నిలిచింది. తాజా నివేదికల ప్రకారం అమీ జాక్సన్, ఆమె కాబోయే భర్త జార్జ్ పనాయొటో విడిపోయారు. అమీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను చూస్తే ఇది అర్థమవుతుంది. రీసెంట్ గా అమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి జార్జితో ఉన్న అన్ని చిత్రాలను తొలగించింది. అప్పటి నుండి అమీ, జార్జ్ విడిపోయిన వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ నివేదికపై అమీ గానీ, జార్జ్ గానీ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. 



అమీ తనకు కాబోయే భర్త జార్జ్ పనాయోటౌతో 2015 నుంచి రిలేషన్ లో ఉంది. జనవరి 2019లో అమీకి జార్జ్ పెళ్ళి ప్రపోజల్ చేశాడు. 3 నెలల తర్వాత జార్జి తన బిడ్డకు తండ్రి కానున్నట్లు అమీ ప్రకటించింది. 2019లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమీ తన కొడుకు ఆండ్రియాస్‌కు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నుండి జార్జ్ కు సంబంధించిన ఫోటోలను అమీ అకస్మాత్తుగా తొలగించడం చాలా ప్రశ్నలకు దారి తీస్తోంది. ఇలా పెళ్ళికి ముందే తల్లైన అమీ కాబోయే భర్తకు అప్పుడే బైబై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: