జ‌గిత్యాల‌ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకటరావుపేట లో ఏకంగా పోలీసులపైనే ఇసుక మాఫియా దాడులకు దిగింది. గోదావరి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకునేందుకు పోలీసు అధికారులు వెళ్లారు. ట్రైనీ ఎస్సై వెంకటేష్ మరియు కానిస్టేబుల్ లు శ్రీనివాస్, రాజ్ కుమార్, సురేష్ తో కలిసి వెళ్లగా ఇసుక మాఫియా దాడి చేసింది. ఇస‌క అక్రమ రవాణా దారులు పోలీసులను చూసి రాళ్లతో దాడి చేశారు.

దాంతో రాజ్ కుమార్, శ్రీను, సురేష్ కానిస్టేబుల్ ల‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్పీ గౌస్ బాబాకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లు అక్కడే వదిలి ఇసుక మాఫియా దారులు పారిపోవడంతో ఆ ట్రాక్టర్ ల‌కు జెసిబి సాయంతో పోలీసు స్టేషన్ కు తరలించారు.  కాగా ఎవ‌రి అండా లేకుండానే ఇసక మాఫియా పోలీసుల‌పై దాడి చేస్తుందా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: