హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు సమీపిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి సంచలనానికి దారి తీశారు.  హుజురాబాద్ లో ఉప ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లేదంటే కోట్లాది రూపాయలు టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఖర్చు చేస్తోందని, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని లోకల్ పోలీసుల సహాయం తో అధికార పార్టీ ప్రతిపక్షాల పై తప్పుడు కేసులు పెడుతోందని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖ లో పేర్కొన్నారు.  పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో హుజురాబాద్ ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్ ని గోనె ప్రకాశ్ రావు కోరారు. ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల వ్యవహారం పై కూడా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: