మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకి సంబంధించి బయటకు వచ్చే పేర్లు ఏంటీ అనే దానిపైనే అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇటీవల వివేకా వాచ్ మెన్ రంగాన్న ఇచ్చిన వాంగ్మూలం కాస్త రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం రికార్డ్ చేసారు. వైఎస్ వివేకా హత్యకేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న వాంగ్మూలం ప్రకారం..

సిబిఐ బృందం విచారణ సిద్దమైనట్లు సమాచారం. ఇటీవల జమ్మలమడుగు కోర్టులో వాచ్ మెన్ రంగన్న తో వాంగ్మూలాన్ని రికార్డ్ చేయించగా ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు ఒక ఊపు ఊపాయి. ఆ వాంగ్మూలంలో రంగన్న వెల్లడించిన పేర్ల పై దృష్టి సారించి విచారణ కు సిబిఐ అధికారులు రెడీ అయ్యారు. దీని ఆధారంగా చూస్తే ఈ కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: