టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరఫున పాల్గొన్న వెయిట్ లిస్టర్ మీరా భాయ్ ఛాను సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. కాగా సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయ్ చానుకు డోమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరా బాయ్ చాను భారత్ త‌ర‌పున పోటీలోకి దిగి సిల్వర్ మెడల్ సాధించిందని... ఆమెకు తినాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా డొమినోస్ ఉచితంగా పిజ్జాలు అందిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. 

చెప్పినట్టుగానే డొమినోస్ పిజ్జా మణిపూర్ లోని మీరా బాయ్ ఇంటికి వెళ్లి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి స్నేహితులకు పిజ్జాల‌ను అందజేసింది. ఈ సందర్భంగా మీరా బాయ్ చానూ సోషల్ మీడియాలో డొమినోస్ పిజ్జా కు కృతజ్ఞతలు తెలిపింది. తనకు తన కుటుంబానికి పిజ్జాను పంపించారని చాలా రుచిగా ఉన్నాయ‌ని చెప్పింది. తాను డోమినోస్ పిజ్జా తో స్నేహం ఇలాగే కొనసాగిస్తానని ప్రకటించింది. తాను పిజ్జా మరియు కూల్ డ్రింక్స్ తీసుకోక చాలా కాలం అయిందని మీరా బాయ్ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: