కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సీఎం యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తానే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ యడియూరప్ప రాజీనామాను జీర్ణించుకోలేని అతని అభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం కర్ణాటక రాష్ట్రం లో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఇక పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి బొమ్మలాపుర గ్రామానికి చెందిన రవి గా గుర్తించారు. 37 ఏళ్ళ యువకుడు కేవలం యడ్యూరప్ప అభిమాని కావడం తోనే ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్టు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: