సోలాపూర్‌లోని బర్షి పట్టణానికి చెందిన స్వతంత్ర శాసనసభ్యుడు రాజేంద్ర రౌత్ తన ఇద్దరు కుమారుల వివాహ వేడుకలు ఆదివారం లక్ష్మి సోపాన్ వ్యవసాయ ఉత్పత్తి కమిటీ ప్రాంగణంలో జరిగాయి. అధికారిక మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో 50 మందికి మాత్రమే వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి అనుమతి ఉంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం బార్షిలో జరిగిన ఈ కార్యక్రమానికి 2,500-3,000 మంది హాజరయ్యారు. అలాగే చాలామంది అతిధులు కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు. మాస్కులు మరియు మరియు సామాజిక దోరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మరియు మరికొందరు పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు వివాహ కార్యక్రమాల నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: