విడ్డూరం : లచ్చ కోట్ల అధిప‌తి మోత్కుప‌ల్లి !
డబ్బులు పంచే ప‌ని..ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే ప‌ని.. అర్హ‌త ఉంటే ప‌థ‌కాల లబ్ధి అందించే ప‌ని ఎవ‌రు చేయాలి..? ఇంకెవ్వ‌రు ప్ర‌భుత్వమే చేయాలి. ఈ సారి కూడా ప్ర‌భుత్వ‌మే అందుకు ముందుకు వ‌స్తోంది..ద‌ళిత బంధు పేరిట తీసుకువ‌చ్చే ఈ ప‌థ‌కం విలువ ల‌క్ష కోట్లు .. ఈ ల‌క్ష కోట్ల అధిప‌తి ఎవ‌ర‌నుకున్నారు మోత్కుప‌ల్లి.. అవును ఆయ‌నే ఈ ల‌చ్చ కోట్ల‌కూ అధిప‌తి.. ఆయ‌న‌దే ఈ డ‌బ్బంతా.. ఆయ‌నే ఈ డ‌బ్బంతా పంచేది కూడా.. రాసేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా రేప‌టి వేళ కేసీఆర్ చేయాల‌నుకుంటు న్న‌ది ఇదే. త‌న త‌ర‌ఫున మాట్లాడేది ఎల‌క్ష‌న్ లో స‌మ‌ర్థంగా ప‌నిచేసేది మోత్కుప‌ల్లే అన్న‌ది ఆయ‌న భావ‌న.అందుకే ఆయ‌న‌ను ఇటుగా ర‌ప్పిస్తున్నార‌ని టాక్. ఇంకేముంది అంతా సైలెంట్ అయిపోయారు. సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరున్న మోత్కుప‌ల్లి గ‌వ‌ర్న‌ర్ క‌ల‌ను నెరవేర్చుకోలేక‌పోయినా ఈ ప‌థ‌కం బాధ్య‌త‌ల‌యినా స‌రిగా అమ‌లు చేస్తార‌ని అంతా భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో నిర్మొహ‌మాటంగా డ‌బ్బులు పంచ‌డం ఇప్పుడు అధికారికం అయిపోయాక ఆ ప‌థ‌కాల‌కు ఇలాంటి బ్రాండ్ ఎంబాసిడ‌ర్ల నియామ‌కే విడ్డూరం.


మరింత సమాచారం తెలుసుకోండి: