భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆల్‌ రౌండర్ క్రునాల్ పాండ్యా మంగళవారం కోవిడ్ -19 బారిన పడ్డాడని జట్టు యాజమాన్యం తెలిపింది. భారత్, శ్రీలంక మధ్య మంగళవారం జరిగే రెండో ట్వంటీ 20 మ్యాచ్ వాయిదా పడిందని జాతీయ మీడియా పేర్కొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో  ఉంది భారత జట్టు.

అటు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అతను కరోనా నుంచి తిరిగి కోలుకుని జట్టుతో కలిసాడు. నెట్ సెషన్ లో ఒకరు కరోనా బారిన పడటంతో భారత బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్, వృద్దిమాన్ సాహా , అభిమన్యు ఈశ్వరన్ కూడా 10 రోజుల పాటు ఐసోలేషణ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: