ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఫ్యాక్షన్ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయంగా ఒకే పార్టీ లో ఉన్నా సరే రాయలసీమ జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఫ్యాక్షన్ బయటపడుతుంది. తాజాగా కడప జిల్లాలో మాజీ  సర్పంచ్ ని దారుణంగా నరికి చంపారు. కడప జిల్లా కొమన్నూతల లో మాజీ సర్పంచ్ చిన్న మునేప్పను దారుణంగా నరికి చంపారు. పాత పాత కక్షలు భగ్గుమనడం తో స్థానికులు కూడా భయపడుతున్నారు.

హత్య చేసిన వాళ్ళు కూడా వైసీపీకి చెందిన వాళ్ళే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇది ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనేది కాస్త కంగారు పెడుతుంది. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా కాస్త కంగారు పెట్టె పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు అనంతపురం జిల్లాలో కూడా ఎమ్మెల్యేల అనుచరుల మధ్య పాత కక్షలు బయటపడి ఇద్దరినీ దారుణంగా హత్య చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: