కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు మాజీ సిఎం వైఎస్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. మేము బతికున్నంత కాలం మా గుండెల్లో వైఎస్ ఆర్ ఉంటారు అని అన్నారు ఆయన. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు వస్తుందని 10 శాతం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు అని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా మీరు చేస్తున్న మంచి కార్యక్రమానికి పూర్తి మద్దతు అని మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

రేపు మా నియోజకవర్గంలో నిధులు ఇవ్వకుండా ప్రారంభాలు చేసే విధంగా  మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన ఉందని మండిపడ్డారు. హుజూరాబాద్ లో లాగా దళితబంధు పథకం ఇక్కడ అమలు చేయాలని 10వేల మందితో నిరసన తెలుపుతాం అని ఆయన స్పష్టం చేసారు. వైఎస్ షర్మిల కు ఫోన్ లో ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం గమనార్హం.

రాజ‌న్న బిడ్డ‌గా అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందని, ష‌ర్మిల గారి దీక్ష‌కు సంఘీభావం తెలియ‌జేస్తున్నా అంటూ శార్మిలకు ఆయన మద్దతు ఇచ్చారు. నా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్ ఉద్య‌మ‌కారుల‌ను మోసం చేశారు  అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: