హుజూరాబాద్ లో ఎలా అయినా సరే విజయం సాధించాలని మాజీ మంత్రి ఈటెల రాజేందర్  పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఆయన ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈటెల ప్రస్తుతం జమ్మికుంట మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా తెరాస పార్టీ బలంగా ఉన్నా సరే నియోజకవర్గంలో ఈటెల బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం.

ఇక ఇదిలా ఉంటే  జమ్మికుంట మండలంలో ఈటెల రాజేందర్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. హుజురాబాద్ లో ఐదుగురు మంత్రులు పని చేస్తున్నారు అని ఈటెల ఫైర్ అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా తిరుగుతున్నారు అన్నారు ఆయన. వాళ్లకు హుజురాబాద్ కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించగలుగుతారా అని నిలదీశారు. మూడేళ్ళుగా రుణమాఫీ ఊసే లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: