టెక్నాలజీ పెరుగుతోన్న కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా మోసాలు చేస్తూ వెళుతున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఒక ముఠా ఎవరూ ఊహించని ఒక క్రైం చేస్తూ దొరికింది. ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మారుస్తున్న ముఠా ఒకదానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి కేంద్రంగా ఈ ముఠా ఆగడాలు చెలరేగిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. 



అలాంటి ఐదు సిమ్ కార్డులను టెలికాం శాఖ సెక్యూరిటీ విభాగం గుర్తించింది. ఇలా చేయడం అంతర్గత భద్రతకు ప్రమాదకరం అని టెలికాం శాఖ చెబుతోంది. అసాంఘిక శక్తులు ఉంటే దేశ భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు టెలికాం శాఖ సెక్యూరిటీ విభాగం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: