శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా నీలి చిత్రాల వ్యవహారం బాలీవుడ్‌ ను ఇప్పుడు వణికిస్తోంది. ఇది కేవలం రాజ్‌ కుంద్రా ఒక్కటి పనే కాదని.. ఇందులో ఇంకా అనేక మంది పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు తగ్గట్టుగానే పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.  

తాజాగా ఈ పోర్నో గ్రఫీ కేసులో మరో 3,4 నలుగురు ప్రొడ్యూసర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా చేరింది. నటి గెహ్నా వశిష్ట పేరు కూడా ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ బూతు చిత్రాల కేసులో ఈమె పాత్ర ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  ఈ కేసు విచారణలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయో అన్న దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: