ఒలింపిక్స్ లో మెడల్ గ్యారంటీ అనుకున్న విభాగాల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో తప్పనిసరిగా మెడల్ వస్తుందని యావత్ భారతావని గంపెడంత ఆశతో ఎదురుచూస్తోంది. అభిమానుల ఆశలను నిలబెడుతూ.. భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్ లో సత్తా చాటుతోంది. గ్రూప్ జేలో జరిగిన లీగ్ మ్యాచ్ లో పీవీ సింధు వరుస సెట్లలో సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్ కు చెందిన ఎన్ గన్ యితో తలపడిన సింధు..... 21-9, 21-16 తేడాతో గెలిచింది. తొలి సెట్ ను కేవలం 15 నిమిషాల్లోనే సింధు ముగించింది. రెండో గేమ్ లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... విజయం మాత్రం సింధునే వరించింది. బలమైన ఏస్ లతో... ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్ లో కూడా విజయం సాధించిన సింధు... వరుస విజయాలతో గ్రూప్ జే టాపర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: