దేవినేని ఉమను అరెస్ట్ చేశామని, ఆయన మా కస్టడీలోనే ఉన్నారని విజయవాడలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రకటించారు. ఉమా శాంతి భద్రతలకు విఘాతం కల్పించారన్న ఆయన అందుకే అరెస్ట్ చేశామని అన్నారు. 100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని, దేవినేని ఉమా పై కంప్లైంట్ ఆధరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామని అన్నారు. ఇక డీఐజీ మోహన్ రావు మాట్లాడుతూ దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి‌ సృష్టించారని ఆరోపించారు. 



ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారన్న ఆయన ముందస్తు పథకం లో భాగంగా దుర్దేశ పూర్వకంగా ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారని అన్నారు. నిన్న జరిగిన పూర్తి అలజడికి దేవినేని ఉమ కారణం అని ఆయన అన్నారు. వైకాపా కార్యకర్తలను రెచ్చ కొట్టే విధంగా ఉమ వ్యవహరించారు అని అన్నారు. అందుకే ఆయన మీద వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: