న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ప్రతి వాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలి వాయిదాకే లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి డుమ్మా కొట్టాడు. లింగారెడ్డి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి... వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోర్టు ఆదేశాల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. వారెంట్ జారీ అవ్వడంతో... వెంటనే లింగారెడ్డి  రాజశేఖర్ రెడ్డి కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించిన న్యాయమూర్తి... లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆగస్టు 5 వరకు రిమాండ్ విధించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: