హుజూరాబాద్ కు జిందాబాద్ లు కొట్టాలే.. మీరో నేనో స‌ల్లంగుండాలంటే ఆ ప‌నే సెయ్యాలే.. తాజాగా పోలీసాఫీసరు ఒక‌రు అట్ట‌నే చే య‌లే..అంతే వారిక బ‌దిలీ అయి పోయారు సారీ బ‌లి అయిపోయారు.. క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మ‌లాస‌న్ రెడ్డికి స్థాన చ‌ల‌నం ద‌క్కించి
అటుపై తాము అనుకున్న‌దే చేసేశారు సీఎం కేసీఆర్..ఆయ‌న‌ను డీజీపీ ఆఫీసుకు స‌రెండర్ చేశార‌ని స‌మాచారం. కొత్తాయ‌న రామ గుండం నుంచి వ‌స్తున్నారు. అక్క‌డ సీపీ స‌త్య‌నారాయ‌ణ ఇక్క‌డకు సీపీగా రానున్నారు. ఆ విధంగా  ఆర్డ‌ర్లు రెడీ అయిపోయాయి. ఇంకేం సారూ మీరేం అనుకుంటే అదే అవుతున్న‌ప్పుడు మీకెందుకు బై పోల్ బెంగ.. ఏం లేదు మీరేం ఫిక‌ర్ గాకుండ్రి,.ఈటెల లాంటి మెత‌కోళ్లు రాజ్యంలో మొండోళ్ల ద‌గ్గ‌ర మెడ‌లు వంచాల్సిందే...ఇప్ప‌టికే రెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధం అయిన కేసీఆర్ కు ఇక గుబులూ లేదు దిగులూ లేదు అని అంటున్నాయి కొన్ని సంఘాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: