పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడిని నిన్న రాత్రి దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన అనంతరం వంశీ తండ్రికి ఫోన్ చేసి 50 లక్షలు ఇవ్వాలని లేదంటే యువకుడిని చంపేస్తామని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం రైతులు పొలాలకు వెళ్తుండగా వంశీ మృతదేహం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారుడు బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు అని ఆ తర్వాత తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వంశీని కిడ్నాప్ చేసామని డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్టు యువకుడి తండ్రి పోలీసులకు వెల్లడించారు.

పోతవరం షుగర్ ఫ్యాక్టరీ వద్ద దుండగులు యువకుడిని హత్య చేశారు. కాగా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకనట్టు తెలుస్తోంది. వంశీ తండ్రికి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇక గ్రామంలో యువకుడి కిడ్నాప్..హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. యువకుడిని 50 లక్షల కోసమే హత్య చేశారా.. ? లేదంటే దాని వెనకాల ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే దానిపై అనుమానాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: