మహిళల ఆల్‌రౌండ్ పోటీలో యునైటెడ్ స్టేట్స్ జిమ్నాస్టిక్స్ స్టార్ సిమోన్ బైల్స్ తన ఒలింపిక్ స్వర్ణాన్ని కాపాడుకోలేక పోయారు. టీమ్ ఫైనల్ నుండి ఆమె వైదొలిగిన ఒక రోజు తర్వాత, యుఎస్ఎ జిమ్నాస్టిక్స్ ఒక ప్రకటనలో, ఆల్-రౌండ్ పోటీ నుండి బైల్స్ వైదొలిగిందని పేర్కొంది. వైద్య పరీక్షల తర్వాత, ఆమె మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి, టోక్యో ఒలింపిక్ క్రీడలలో తుది వ్యక్తిగత ఆల్‌రౌండ్ పోటీ నుండి సిమోన్ పైల్స్ వైదొలిగారు" అని యుఎస్‌ఎజి తన ప్రకటనలో తెలిపింది. "వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో పాల్గొనాలా వద్దా అని నిర్ణయించడానికి సిమోన్ ప్రతిరోజూ వైద్య పరీక్షలకు హాజరవుతుందని వెల్లడించారు. అయితే వ‌చ్చే వారం జ‌రిగే వ్య‌క్తిగ‌త ఈవెంట్ ఫైన‌ల్స్‌లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిదవ అత్యధిక స్కోరు సాధించిన జాడే కారీ, ఆల్‌రౌండ్‌లో ఆమె స్థానంలో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: