టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విషయంలో వైసీపీ నేతలు కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణూ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం లో ప్రజలంతా టీడీపీ ని ఏకపక్షంగా తిరస్కరించారన్నారు ఆయన. దేవినేని ఉమ ను ప్రజలు ఛీ కొట్టినా బుద్ది మారలేదు అని వసంత కృష్ణ ప్రసాద్ చేతితో ఓటమిని జీర్ణించుకోలేక కుట్ర చేస్తున్నారు అని మండిపడ్డారు.

మైనింగ్ అక్రమాలు జరిగితే... అధికారుల దృష్టి లో ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. ఆయన అనుచర గణంతో రాత్రి పూట పరిశీలనకు‌ వెళతారా అని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నేతలపై దాడి చేశారుఅని ఏదోరకంగా‌ వసంత కృష్ణ ప్రసాద్ పై బురద జల్లాలని‌ చూస్తున్నారు అని విమర్శలు చేసారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలి అని హితవు పలికారు. గతంలో జక్కంపూడి లో ప్రజలే తరిమి కొట్టారు అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: