తెలంగాణ పాలిసెట్‌ - 2021 : ఎస్ఎస్సి పూర్తి చేసిన అనంతరం డిప్లమా కోర్స్ చేయడానికి ఎంట్రీ కోసం జరిగే తెలంగాణ పాలిసెట్‌ - 2021 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు ఈ ఫలితాలను బుధవారం రోజు వెల్లడి చేయగా, ఈ పరీక్ష ను జులై నెల 17 వ తారీఖున కండక్ట్ చేశారు. ఈ అర్హత పరీక్ష లో మొత్తం 1, 02, 496 విద్యార్థులు అప్లికేషన్ చేసియువుగా, కేవలం 92, 557 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష లో పాల్గొన్నారు. ఇక ఈ ఫలితాల్లో 75, 666 మంది ఉత్తిర్ణులు కాగా, తదుపరి రెండు విడతల కోసం షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మొదటి విడత ప్రవేశాలు వచ్చే నెల ఆగస్టు 5 నుంచి మొదలవుతుండగా, 9 వరకు ఈ స్లాట్ బుకింగ్ ఉండబోతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: