టోక్యో ఒలంపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు పథకాల వేటలో దుమ్ము లేపుతున్నారు. తాజాగా ఆర్చర్ దీపికా కుమారి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. USA యొక్క జెన్నిఫర్ ముసినో-ఫెర్నాండెజ్‌పై కాస్త తడబడుతూ గెలిచినా దీపికా కుమారి ఉమెన్స్ ఇండివిజువల్ ఈవెంట్ ప్రీ-క్వార్టర్స్‌కు చేరుకుంది. ఈ పోటీలో దీపిక 6-4 తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇక దీపికా కుమారి ఆర్చరీ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 రాంక్ లో ఉండగా, ఒలంపిక్స్ లో మాత్రం 9 వ రాంక్ గా నిర్ణయించబడింది. అంతకుముందు రోజు, 64 వ రౌండ్లో భూటాన్ క్రీడాకారిణి కర్మా ను ఓడించి తొలి రౌండ్ విజయం సాదించింది దీపికా. ఇక దీపికా కి టోక్యో లో పరిస్థితులు అంత ఆశాజనకం గా ఏమి లేవు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దీపిక నిరాశను ఎదుర్కొంది.రాబోయే రౌండ్లలో కఠినమైన పరీక్షలను దీపికా ఎదుర్కోబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: