కేసీఆర్ సేన‌లో కోటిమంది కూడా లేరా?
కేసీఆర్ ప్రాణం పెట్టి ప్రారంభించిన పార్టీ..స‌ర్వం ఒడ్డి నిల‌బెట్టిన పార్టీ. తెలంగాణ వ‌చ్చుడో చచ్చుడో అన్న పార్టీ అలాంటి పార్టీకి కోటి మంది స‌భ్యులు కూడా లేరా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఇప్పటిదాకా 61ల‌క్ష‌ల మంది మాత్ర‌మే స‌భ్య‌త్వాల తీసుకున్నా ర‌ని, వీరిలో 55 ల‌క్ష‌ల మంది వివ‌రాలు డిజిట‌లైజేష‌న్ పూర్త‌య్యాయ‌ని కేటీఆర్ ఇవా ళ వెల్ల‌డించారు. డిజిట‌లైజేష‌న్ పూర్తి చేసుకు న్న స‌భ్యుల‌కు ప్ర‌మాద బీమా వ‌ర్తిస్తుందని అన్నారు. ఈ  నెలాఖ‌రు నాటికి డిజిట‌లైజేష‌న్ పూర్తి చేయ‌కుంటే బీమా వ‌ర్తించద‌ని తెలి పారు. ఇవాళ డిజిట‌లైజేష‌న్ అంశంపై మాట్లాడుతూ..కొంద‌రు ఇంకా ఈ ప్ర‌క్రియ‌పై ఆస‌క్తి చూప‌డం లేద‌ని పేర్కొంటూ సంబంధిత ప్ర జాప్ర‌తినిధుల‌తో ఈ విష‌య‌మై చ‌ ర్చించారు. త్వ‌రిత‌గ‌తిన ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని కోరారు. టీఆర్ఎస్ స‌భ్య‌త్వం తీసుకున్న వా రికి వ‌చ్చే నెల ఒక‌టి నుంచి బీమా వ‌ర్తిస్తుంద‌ని వివ‌రించారు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: