అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప"కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకున్నప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లో మరో షాకింగ్ విషయం 'పుష్ప' రాజ్ అభిమానులను కలవరపరుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా డెంగ్యూ బారిన పడినట్టు తెలుస్తోంది. 'పుష్ప' సినిమా చిత్రీకరణ అడవుల్లో జరుగుతుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు. మరి టీంలోని ఇంకా ఎంతమందికి డెంగ్యూ సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఆ ఎఫెక్ట్ సినిమా రిలీజ్ పై కూడా పడకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి: