రోజు రోజుకీ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న దంపతులు వ్యవహారం కలకలం రేపుతోంది. శరీరం మీద బంగారం కోసం మహిళల హత్య చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 



ఇప్పటివరకు ఎనిమిది హత్యలు చేసినట్లు భర్త ఒప్పుకోగా, పదకొండు హత్యలు చేసినట్లు భార్య ఒప్పుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేస్తున్నారు. ఒక మిస్సింగ్ ఫిర్యాదుతో ఈ ఘరానా దంపతులు దొరికినట్టు చెబుతున్నారు. కూలీ పని ఇప్పిస్తామని నమ్మబలుకుతూ హత్యలు చేస్తున్నట్టు పోలీసుల వద్ద వీరు ఒప్పుకున్నారని అంటున్నారు. సంగారెడ్డి జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి బంగారం దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: