చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న వాసు దారుణ హత్యకు గురయ్యాడు. వాసుని దారుణంగా హత్య చేసిన భార్య స్వప్న ప్రియ హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నాటకం ఆడింది. అయితే తండ్రి మెడ మీద గాయాలు గుర్తించిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు పోస్టుమార్టం చేయించగా పోస్టుమార్టం రిపోర్టులో వాసు మెడ విరిగినట్టు గుర్తించారు. 



వాసు భార్య స్వప్న ప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అరిగెల వారి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాసును హత్య చేసింది భార్య అని పోలీసులు తేల్చారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని వాసు మెడ విరిచి భార్య హత్య చేసినట్లు గుర్తించారు. కుమారుడు తండ్రి మెడకు గాయాలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: