ఇదివరకు పెళ్లిళ్లు జరగడం లేదని అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవడం కనిపించేది. అబ్బాయిలు కట్నం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని ఇతర కారణాల వల్ల తమకు ఇక పెళ్ళి జరగదేమో అని మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమ్మాయిల శాతం తగ్గడంతో పెళ్లీడుకు వచ్చిన యువకులకు జోడి దొరకడం కష్టంగా మారింది. దాంతో ఇప్పుడు వివాహం అవ్వ‌డం లేదనే కారణంతో పురుషులు ఆత్మహత్య చేసుకోవడం కనిపిస్తుంది.

తాజాగా వివాహం కాలేదని తీవ్ర మనస్థాపం చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కవాడిగూడ లో జరిగింది. సిద్దిపేటకు చెందిన గోపాల్ అనే వ్యక్తి కవాడిగూడలో నివాసం ఉంటున్నాడు. వయసు పైన పడినా పెళ్లి జరగడం లేదని గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రూమ్ లో ఒక సూసైడ్ లెటర్ లభించింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఆంజనేయస్వామి పిలిచాడని అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోతున్నా అని లెట‌ర్ లో రాసి ఉందన్నారు. కాగా ఇటీవలే తమ్ముడికి పెళ్లి జరిగి తనకు జరగకపోవడంతో గోపాల్ తీవ్ర మ‌న‌స్థాపం చెందాడ‌ద‌ని అత‌డి బంధువు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: