గత నాలుగు రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డిగా నల్గొండ జిల్లాలో రాజకీయం నడుస్తుంది. ఎమ్మెల్యేకి మంత్రికి ఒక బహిరంగ సభలో గొడవ జరగగా... ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి కూడా మంత్రిని టార్గెట్ చేసారు. దీనితో ఇద్దరికీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు సమాధానం ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా నదిలో నల్గొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించిందన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆయన ఆరోపణలు చేసారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఉసురు తీసింది ఆ అన్నదమ్ముల్లేనన్న ఆయన... ఎక్కువ మాట్లాడితే బట్టలిప్పి కొడతాం అని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర నేతల  కింద బానిసలుగా పనిచేసిన చరిత్ర మీది అని ఆరోపణలు చేసారు. మీ రౌడీ రాజకీయాలు నా దగ్గర కాదు అని వార్నింగ్ ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదు అన్నారు మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: