సాధారణంగానే శిల్పా శెట్టి ప్రముఖ సెలబ్రెటీ అయినప్పటికీ తాజాగా తన భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం వల్ల త‌ర‌చూ వార్తల్లో నిలవడం వల్ల రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అంటే తెలియని వారు లేరేయో అనేలా మారిపోయింది. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ తల్లి కి తాజాగా ఓ షాక్ తగిలింది. శిల్పా శెట్టి తల్లి సుందర శెట్టి ని సుధాకర్ గారె అనే వ్యక్తి మోసం చేశాడు. భూమి కొనుగోలు విషయంలో సుధాకర్ గారె శిల్పాశెట్టి త‌ల్లిని మోసం చేశాడు.

నకిలీ పత్రాలు చూపించి 1.6 కోట్ల భూమిని శిల్పా శెట్టి త‌ల్లికి అమ్మాడు. దాంతో శిల్పాశెట్టి త‌ల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా నిజానికి శిల్పా శెట్టి తల్లి కేటుగాడి చేతిలో మోసపోయింది అంటే బాధపడాల్సిన విషయమే.... కానీ రాజ్ కుంద్రా శిల్పాశెట్టి  చేసిన మోసాల కంటే ఇది పెద్ద మోసం కాదని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. రాజ్ కుంద్రా ఇలాంటివి ఎన్నో చేసి ఉంటాడ‌ని అందుకే ఆ పాపం ఇప్పుడు పండుతోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: