అనంతపురంలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనంతలో బెంగళూరు రాయలసీమ హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ ఒక్కసారిగా కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రహస్యంగా సమావేశమైన హిజ్రాలు... సమస్య గురించి చర్చించుకున్నారు. రాయలసీమ గ్రూప్ కు చెందిన ఓ హిజ్రా ను బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.

దీనికి ప్రతిగా బెంగళూరు గ్యాంగ్ నుంచి కూడా ఒకరిని కిడ్నాప్ చేసింది రాయలసీమ గ్యాంగ్. రాయలసీమ బ్యాచ్ కు చెందిన ఒకరి పై అటాక్ చేసి  నగలు డబ్బుని బెంగళూరు గ్యాంగ్ లాక్కెళ్ళింది.  కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమైన రాయలసీమ హిజ్రాల గ్యాంగ్... దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: