తిరుపతి అలిపిరి ప్రాంతంలో అంతర్జాతీయ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చే ఒక ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ ముఠాలో ఆరుగురు సభ్యులు ఉన్నట్టు గా పోలీసులు గుర్తించారు. వీరి దగ్గర నాలుగు టెలికాం గేట్ వేలు, 116 యాక్టివ్ సిమ్ములు అలాగే ఇంటర్నెట్ మోడెమ్ లు, పలు కంప్యూటర్లు మరియు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ప్రోటోకాల్ పద్ధతి ని ఉపయోగించి వీరు అంతర్జాతీయ కాల్స్ ని ఇంటర్నెట్ లో వాయిస్ ఓవర్ లోకల్ కాల్స్ గా మార్చుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఇప్పటికే వెయ్యి సిమ్ కార్డ్స్ ని ఉపయోగించి మోసానికి పాల్పడినట్టు గా తెలుస్తోంది. మీడియా ముందు నిందితులని ప్రవేశ పెట్టారు పోలీసులు. అలాగే వీరి ద్వారా బాధితులు ఏమైనా నష్టపోయారా అనే వివరాల కోసం విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: