హుజూరాబాద్ లో అతి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ
మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జమ్మికుంట మండలం విలాసపూర్ గ్రామంలో
మంత్రి ఈటల పర్యటించారు. ఈ సందర్భగా రాజేందర్ మాట్లాడుతు చిల్లర రాజకీయాలు చేస్తున్న
కేసీఆర్ ని దుమ్మెత్తిపోశారు. మాదిగల తో మీటింగ్ పెడితే నన్ను రాజేందర్ మాదిగ అని
కేసీఆర్ పిలిచే వాడని చెప్పారు. దళితుడిని
ముఖ్యమంత్రి చేస్తా అన్న
కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి పోయాడు ప్రశ్నించారు ఈటెల రాజేందర్. ఆర్ఎస్
ప్రవీణ్ కుమార్ వంటి దళితుల సంక్షేమి ని పోలీసు ఉద్యోగం నుంచి తప్పించాలని విమర్శించారు ఈటల రాజేందర్. తన
రాజీనామా అనంతరం దళితులకు ఎక్కడలేని మర్యాదలు చేస్తున్న
కేసీఆర్ ఏసి బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి మరి
ప్రగతి భవన్ కి తీసుకెళ్తున్నారని దుయ్యబట్టాడు.