హుజురాబాద్ లో ఉప ఎన్నిక పుణ్యమా అంటూ దళితులకు కేసీఆర్ వరసగా శుభవార్తలు చెబుతున్నాడు. ఆ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ ని ఎదుర్కోవడానికి దళితులకు వరాల జల్లు కురిపించిన ఆయన అందులో భాగంగా దళిత బంధు పథకం కింద రెండు వేల కోట్లు కేటాయించబోతున్నట్టు ప్రకటన చేశాడు. అందులో భాగంగా మొదటి విడతగా 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని మొదట గా హుజురాబాద్ లో అమలు చేయబోతున్న ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నట్టు విడుదల చేసినట్టు తెలిపారు. ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఒక హుజురాబాద్ నియోజకవర్గాని కి రెండు వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రతి దళితులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: